Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

500 యేళ్ళ చరిత్ర కలిగిన కోదండ రామాలయాన్ని విలీనం చేసుకున్న టీటీడీ

Advertiesment
TTD takes over Chandragiri temple
చుట్టుపట్ల ఆలయాలను తనలో విలీనం చేసుకునే ప్రక్రియను తిరుమల తిరుపతి దేవస్థానం కొనసాగిస్తోంది. దాదాపుగా 5 వందల యేళ్ళ చరిత్ర కలిగిన మరో కోదండ రామాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తనలో విలీనం చేసుకుంది. 
 
16 శతాబ్ధంలో నిర్మితమైన కోదండ రామాలయం చంద్రగిరి పట్టణంలో కొలువుదీరి ఉంది. అయితే ఆలనా పాలనా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతిదేవస్థానంలో కలిపేస్తూ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. 
 
దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి బుధవారం మధ్యాహ్నం ఆ పత్రాలను తీసుకున్నారు. దీంతో చంద్రగిరి కోదండ రామాలయం టీటీడీ గొడుగు కిందకు వచ్చినట్లయ్యింది. ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు. 

Share this Story:

Follow Webdunia telugu