తిరుమల తిరుపతి దేవస్థానం పరిదిలోకి వచ్చే శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి పుష్పయాగం పోస్టర్ ను ఆ సంస్థ కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు గురువారం తిరుమలలో విడుదల చేశారు.
ఇవి మార్చి 17 నుంచి ప్రారంభం కానున్నది. మార్చి 17న పుష్పయాగాన్ని పురస్కరించుకుని స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.