టిటిడి పాలకమండలి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు విచ్చేసిన ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. వైకుంఠం కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన ఆయన విఐపి విరామ సమయంలో దర్శనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను టిటిడి ఛైర్మన్ వడమనేది తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు దయవల్లే తనకు తితిదే పాలకమండలి ఛైర్మన్గా అవకాశం కలిగిందని తెలిపారు. వేంకటేశ్వర స్వామి వద్ద తాను ఓ సాధారణ భక్తుడిలా ఉండి సేవచేస్తానన్నారు. మే 2వ తేదీ ఉదయం 11.15 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు చదలవాడ తెలిపారు.