Publish Date: Sat, 01 Aug 2015 (21:51 IST)
Updated Date: Sat, 01 Aug 2015 (21:55 IST)
గానకోకిల పి.సుశీల శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న సుశీలకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కుటుంబసభ్యులతో తిరుమలకు విచ్చేసిన ఆమెకు టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
అలాగే ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్సింగ్, పుదుచ్ఛేరి గవర్నర్ జనరల్ ఎ.కె.సింగ్ శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే అధికారులు ప్రముఖులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.