Publish Date: Fri, 03 Apr 2015 (07:15 IST)
Updated Date: Fri, 03 Apr 2015 (06:28 IST)
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలలో గురువారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 40,465 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లు 26నిండాయి. వారికి 16 గంటల సమయం పడుతోంది.
ఇక నడకదారిన వచ్చే భక్తులు 10 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 10 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా శనివారం కూడా రద్దీ పెరిగే అవకాశం ఉంది.