తిరుమలలో బుధవారం సాధారణ రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 50,148మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
మంగళవారం ఉదయం సమయానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్లో 4 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండాయి. వీరికి 4గంటలు, కాలిబాటన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి 3 గంటల్లోస్వామివారి దర్శనం జరుగుతోంది.
గదుల కోసం 2గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. తలనీలాలు సమర్పించుకునేందుకు గంట వేచి ఉండాల్సి వస్తోంది. తిరుమలలో బుధవారం ఉదయానికి భక్తుల రద్దీ తక్కువగా ఉంది