వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం రాత్రి మలయప్ప స్వామి ముత్యపుపందిరి వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగారు. కృష్ణుడి అవతారంలో భక్తులకు సాక్షాత్కరించారు.
చాలా వేడుకగా సాగిన ఈ కార్యక్రమం తిరుమాడ వీధులలో అత్యంత అద్భుతంగా సాగింది. వాహన మండపంల నుంచి 9 గంటల ప్రాంతంలో స్వామి తిరుమాడ వీధుల ఊరేగింపునకు బయలుదేరారు. ఆయన రాకను స్వాగతిస్తున్న వరుణుడు స్వాగతం పలికారు. కృష్ణుడి వేషంలో ఉన్న స్వామిని చూసి భక్తులు తరించారు.