తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. తిరుమలలో మంగళవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 60,041 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లు 1 నిండాయి. వారికి 2 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 1 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 2 గంటల సమయం పడుతోంది.
ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం నుంచి రద్దీ తగ్గుముఖం పట్టింది. ఈ పరిస్థితి బుధవారం కూడా ఇలాగే ఉండవచ్చు. గురువారం నుంచి క్రమేణ పెరుగుతూ శనివారానికి కొండ నిండిపోతుంది.