ఎంతోమంది వికలాంగులకు నడకను ప్రసాదిస్తున్న బర్డ్ సంస్థకు రూ. కోటి విరాళంగా లభించింది. హైదరాబాద్కు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఈ విరాళాన్ని ఇచ్చారు.
తిరుమల శ్రీవారికి హైదరాబాద్కు చెందిన పారిశ్రామికవేత్త ఆనందప్రసాద్ రూ.కోటి విరాళం అందజేశారు.మంగళవారం తిరుమలలో రూ.కోటి చెక్కును తితిదే ఈవో సాంబశివరావుకు అందజేశారు.
ఈ నిధులను బాలాజీ వికలాంగుల శస్త్ర చికిత్సశాల ట్రస్టుకు జమ చేయాలని ఈ సందర్బంగా ఆనంద ప్రసాద్ తితిదే ఈవోను కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున చేసే సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ఆనందంగా ఉందని దాత అన్నారు.