Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏప్రిల్ 21 నుంచి చారధామ్ యాత్ర.. తగ్గుతున్న భక్తుల సంఖ్య

Advertiesment
chardham
, సోమవారం, 23 మార్చి 2015 (08:54 IST)
వేసవి వచ్చిందంటే హిమగిరులలోని, హిమగిరిలను ఆనుకుని ఉన్న ఆలయాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. అక్షధామ్, చార్ ధామ్, కేథారీనాథ్ ఇలా ఒకటేంటి.. పర్వతపంక్తిలోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 21 నుంచి ఆలయాన్ని భక్తుల దర్శనానికి తెరవనున్నట్లు ఆలయ అధికారులు వివరించారు. 
 
హిందువుల పర్వదినమైన అక్షయ తృతీయ రోజున గంగోత్రి, యమునోత్రి దేవాలయాల ద్వారాలు తెరుస్తారన్నారు. మిగిలిన రెండు పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌ శీతాకాలం అక్టోబరు నుంచి నవంబరు వరకు మూసి ఉంచుతారు. కేదార్‌నాథ్‌లో 2013 జూన్‌లో జరిగిన ప్రకృతి వైపరీత్యం అనంతరం చార్‌ధామ్‌ యాత్రకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని అధికారులు పేర్కొన్నారు.
 
2012లో చార్‌ధామ్‌ యాత్రికుల సంఖ్య 2.84 కోట్లుగా ఉంటే 2013లో వారి సంఖ్య 2.09 కోట్లకు పడిపోయింది. 2014లో 2.26 కోట్ల మంది యాత్రికులు చార్‌ధామ్‌ సందర్శించారని అధికారులు చెప్పారు. చార్‌ధామ్‌ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య పడిపోవడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల సంఖ్య పెంచడానికి చర్యలు చేపడుతున్నామని ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu