Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీటితో బరువు తగ్గవచ్చు... ఎలా?

మనం ఎన్నోసార్లు వినే ఉంటాం. పరగడుపున మంచినీళ్ళు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని. పరగడుపున నీళ్ళు తాగితే అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో అనారోగ్య సమస్యలను పనిచేస్తుందని వైద్యశాస్త్రం కూడా ధృవీకరించింది. నిద్ర లేవగానే ఒకటిన్నర లీటర్ల మంచినీటిన

నీటితో బరువు తగ్గవచ్చు... ఎలా?
, సోమవారం, 24 జులై 2017 (14:14 IST)
మనం ఎన్నోసార్లు వినే ఉంటాం. పరగడుపున మంచినీళ్ళు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని. పరగడుపున నీళ్ళు తాగితే అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో అనారోగ్య సమస్యలను పనిచేస్తుందని వైద్యశాస్త్రం కూడా ధృవీకరించింది. నిద్ర లేవగానే ఒకటిన్నర లీటర్ల మంచినీటిని తాగాలి. ఆ తరువాత గంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.
 
పరగడుపున నీళ్ళు తాగితే పెద్ద పేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది. కొత్త రక్తం తయారై కండర కణాల వృద్థిని పెంచుతుంది. కనీసం అరలీటర్ నీటిని తాగితే 24 శాతం మెటబాలిటీ శాతాన్ని పెంచుతుందట. అంతేకాదు బరువు తగ్గడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. 
 
అలాగే రక్తకణాలను శుద్ధి చేయడం వల్ల శరీరంలోని మలినాలు తొలగుతాయి. దాంతో శరీర ఛాయ ప్రకాశిస్తుంది. శ్వేత ధాతువులను సమతుల్యం చేస్తుంది. ఈ గ్రంథుల వల్ల రోజువారి కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా శరీర ద్రవ పదార్థాన్ని కోల్పోకుండా ఇన్ఫెక్షన్లు దరి చేరనీయకుండా పోరాడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పండ్ల ముక్కలపై ఉప్పు చల్లుకుని తింటున్నారా?