Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధ్యాహ్నం 2 గంటలలోపు తింటే బరువు తగ్గుతారట...

చాలామంది బరువు తగ్గేందుకు డైటింగ్‌ల పేరుతో కడుపు కాలుస్తుంటారు. మహిళలు అయితే ఉపవాసాల పేరుతో పస్తులుంటారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గరు కదా.. మరింతగా పెరుగుతారట. యూనివర్సిటీ ఆఫ్‌ అలబామా వైద్యనిపుణులు తా

మధ్యాహ్నం 2 గంటలలోపు తింటే బరువు తగ్గుతారట...
, మంగళవారం, 25 జులై 2017 (06:45 IST)
చాలామంది బరువు తగ్గేందుకు డైటింగ్‌ల పేరుతో కడుపు కాలుస్తుంటారు. మహిళలు అయితే ఉపవాసాల పేరుతో పస్తులుంటారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గరు కదా.. మరింతగా పెరుగుతారట. యూనివర్సిటీ ఆఫ్‌ అలబామా వైద్యనిపుణులు తాజాగా జరిపిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
 
ఎలాంటి ఆహారం తీసుకున్నా.. ఎంత ఎక్కువగా తిన్నా... ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 లోపు తినాలట. ఆ తర్వాత ఇక ఏమీ తినకూడదట. దీనివల్ల జీవక్రియల రేటు పెరిగి కొవ్వు ఎక్కువగా కరుగుతుందని, తద్వారా బరువు తగ్గుతారని వారు చెపుతున్నారు. 
 
ఇందుకోసం కొంతమంది స్త్రీపురుషులపై చేసిన అధ్యయనంలో తేలింది. ఇది పరిమిత సంఖ్యలో వ్యక్తులపై చేసిన అధ్యయనమని.. విస్తృత స్థాయిలో చేసి, పరిణామాలను అంచనా వేయాలని వారు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సొరకాయ గింజలు - జీలకర్ర మిశ్రమాన్ని అన్నంలో తీసుకుంటే...