Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనారోగ్యాన్ని పారదోలాలంటే ఈ పండ్లు తింటే చాలు...

Advertiesment
అనారోగ్యాన్ని పారదోలాలంటే ఈ పండ్లు తింటే చాలు...
, గురువారం, 27 జూన్ 2019 (22:41 IST)
ఆయా కాలాల్లో లభించే పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా వుండవచ్చు. పలు అనారోగ్యాలకు కారణం పండ్లను తీసుకోకపోవడమే. ముఖ్యంగా క్రింద తెలిపిన మూడు రకాల పండ్లను తీసుకుంటుంటే దాదాపుగా అనారోగ్యాన్ని దరిచేయకుండా చూడవచ్చు. అవేమిటో చూద్దాం.
 
1. బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్‌బెర్రీ పండ్లలో ఉండే విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ అన్నీ శరీర ఆరోగ్యానికి దోహదపడతాయి. ఇంకా ఇందులో మ్యాంగనీస్, పొటాషియమ్ ఉంటాయి. బెర్రీ పండ్లలోని పొటాషియమ్ రక్తపోటును నివారించడం ద్వారా గుండెకు మేలు చేస్తుంది. 
 
2. నిమ్మజాతికి చెందిన పండ్లన్నీ గుండెకు మేలు చేసేవే. బాగా పండిన నారింజలో విటమిన్ - ఏ, బి6, సి పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు ఫోలేట్ పొటాషియమ్, ఫైబర్ ఎక్కువ. పొటాషియమ్ వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండెకు రక్షణ కలుగుతుంది.  
 
3. మెరుస్తున్నట్లుగా ఎర్రటి రంగులో ఉండే ఆపిల్ గుండెకు మేలుచేస్తుంది. ఇందులోని ప్లేవనాయిడ్స్ రక్తనాళాల్లోని ప్లేట్‌లెట్లు రక్తనాళాల గోడలకు అంటుకోకుండా చూస్తాయి. దాంతో పాటు రక్తనాళాల గోడలకు అంటుకోకుండా చూస్తాయి. దాంతోపాటు రక్తనాళాలు మూసుకుపోకుండా చూడటం, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇలాంటి స్నానం చేస్తున్నారా లేదా..? చేస్తే ఏమవుతుంది?