Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కీళ్ళు నొప్పులకు పారిజాతం ఆకులు... అలాంటి వాళ్లు మాత్రం తీస్కోకూడదు...

కీళ్ళు, మోకాళ్ళ నొప్పులకు మన ఋషులు వైద్యాన్ని మన వంటింటి దాకా తెచ్చారు. మోకాలిచిప్పలు మార్చవలసిన పరిస్థితులలో కూడా ఈ వైద్యం పూర్తిగా నయం చేసిన సంఘటనలు జ‌రిగాయి. *కీళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఉదయాన్నే లేచి పారిజాతం ఆకులు నాలుగు తీసుకుని నలిపి

కీళ్ళు నొప్పులకు పారిజాతం ఆకులు... అలాంటి వాళ్లు మాత్రం తీస్కోకూడదు...
, మంగళవారం, 5 జులై 2016 (15:32 IST)
కీళ్ళు, మోకాళ్ళ నొప్పులకు మన ఋషులు వైద్యాన్ని మన వంటింటి దాకా తెచ్చారు. మోకాలిచిప్పలు మార్చవలసిన పరిస్థితులలో కూడా ఈ వైద్యం పూర్తిగా నయం చేసిన సంఘటనలు జ‌రిగాయి.
 
*కీళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఉదయాన్నే లేచి పారిజాతం ఆకులు నాలుగు తీసుకుని నలిపి గ్లాసు నీళ్ళలో వేసి అరగ్లాసు అయ్యే వ‌ర‌కూ మరగించి, వడకట్టి చల్లార్చి పరగడుపునే త్రాగాలి. 
* రోజుకు రెండుసార్లు గ్లాసు మజ్జిగలో ఒక‌ గ్రాము కిళ్ళీలో వాడే సున్నం క‌లిపి త్రాగాలి.
* రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు ఆవు పాలలో ఒక చిన్న చెంచా పసుపు కలిపి వేడి చేసి, దించి దానిలో ఒక‌ చెంచా ఆవు నెయ్యి వేసి, బాగా తిరగగొట్టి త్రాగాలి.
* ఈ వైద్యం కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకు వాడకూడదు.
* సాధారణ నొప్పులు ఉన్నవారు 45 రోజులు, బాగా ఎక్కువగా నొప్పులు ఉన్నవారు 3 నెలలు వాడాలి.
* ఈవిధంగా చేసే సమయంలో మాంసాహారం తీసుకోకుండా ఉంటే మంచిది. బాగా అరిగే తేలికైన అహారం ఉపయుక్తం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ పని ముగిశాక 'ఐ లవ్ యూ' అని చెప్పాడా...? ఐతే అది కూడా అయిపోయినట్లే...