Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమలపాకులు, నాలుగు మిరియాలు వేసి అలా చేసి తాగితే...

తమలపాకులు, నాలుగు మిరియాలు వేసి అలా చేసి తాగితే...
, మంగళవారం, 28 డిశెంబరు 2021 (21:56 IST)
శీతాకాలం వచ్చిందంటే ఎటు చూసినా మంచుదుప్పటి పరుచుకుని వుంటుంది. దానితో పాటే సీజనల్ వ్యాధులు కూడా తరుముకుంటూ వస్తాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు వచ్చేస్తాయి. ఈ కరోనా కాలంలో నాలుగు తుమ్ములు తుమ్మినా భయపడిపోవాల్సిన పరిస్థితి వచ్చేస్తోంది. ఐతే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం వుంది కనుక వాటిని అడ్డుకునేందుకు ఇంటి చిట్కాలను పాటించాలి.

 
దగ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతున్నప్పుడు ప్రతిరోజూ ఉదయం మూడు కప్పుల నీళ్లలో రెండు తమలపాకులు, నాలుగు మిరియాలు వేసి సగం అయ్యేవరకు నీటిని మరిగించి అందులో ఒక టీస్పూన్ తేనె కలుపుకుని తాగాలి. దగ్గు నుండి ఉపశమనం పొందడానికి తులసి ఆకులను తేనెతో కలిపి పరగడుపున తీసుకోవాలి. దానిమ్మ తొక్కలను పొడి చేసి ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ కలిపి తీసుకుంటే రక్త శుద్ది జరుగుతుంది. 

 
వెన్నునొప్పితో బాధపడేవారు నువ్వుల నూనె లేదా ఆముదంలో వెల్లుల్లి రెబ్బలు వేసి ఐదు నిమిషాల పాటు సన్నని మంటపై మరిగించాలి. ఈ నూనెతో వెన్నుకు మర్దనా చేయాలి. అలాగే వెన్ను నొప్పి ఉన్నచోట అల్లం పేస్టుతో మర్దనా చేసినా నొప్పి తగ్గుతుంది. ఏదైనా గాయాలు తగిలి రక్తం కారుతుంటే చందనం పొడిలో కొద్దిగా నీటిని కలిపి పేస్టులా చేసుకుని గాయానికి రాయాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్ డౌన్ కాలంలో ఎక్కువవుతున్న లివర్ సమస్యలు, ఎందుకో తెలుసా?