Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కడుపులో మంటకు చెక్ పెట్టే దోసకాయ

Advertiesment
stomach
, మంగళవారం, 12 ఏప్రియల్ 2016 (10:06 IST)
కీరదోస, మామూలు దోస రెండూ మనకు మేలు చేస్తాయి. రక్తపోటులో తేడా ఏర్పడినవారికి దోసకాయ తినడం వల్ల మేలు కలుగుతుంది. అందులోని పొటాషియం రక్తపోటులోని హెచ్చుతగ్గులను సరిచేస్తుంది. దోసలోని లవణాలు గోళ్లను అందంగా, చిట్లకుండా ఉంచుతాయి.
 
కళ్లకింద నల్లటి చారలను కీరదోసకాయ ముక్కలు తొలగించగలవు. కళ్లు ఉబ్బినట్లు ఉంటే వాటిమీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితమిస్తాయి. శిరోజాల ఎదుగుదలకు కీర మంచిదే. అందులోని సల్ఫర్, సిలికాన్ శిరోజాలకు ఆరోగ్యాన్నిస్తాయి. 
 
దోస రసం కడుపులో మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దోసను తొక్కుతో తినడం మంచిది. తొక్కులో విటమిన్ కె సమృద్ధిగా ఉంటుంది. చర్మానికి మేలు చేసే గుణం దోస తొక్కులో ఉంది. దోసకాయను ఊరగాయగా తినకూడదు.

Share this Story:

Follow Webdunia telugu