Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎండు ద్రాక్ష రాత్రి పూట నానపెట్టి ఉదయం మెత్తగా పిసికి పదిరోజులు తీసుకుంటే...

ద్రాక్ష పండ్లు అనారోగ్యంగా వున్నవారికి చాలా ఉపయోగపడుతాయి. అజీర్ణ వ్యాధులు, జ్వరం వచ్చినప్పుడు, లివర్ బలహీనతకు, గుండె బలహీనులకు శ్లేష్మము బహిష్కరింప చేయటానికి రక్తశుద్ధికి, మధుమేహానికి, బరువు తగ్గటానికి, పిచ్చి, హిస్టీరియా తదితర మానసిక వ్యాధులకు మంచి

ఎండు ద్రాక్ష రాత్రి పూట నానపెట్టి ఉదయం మెత్తగా పిసికి పదిరోజులు తీసుకుంటే...
, శుక్రవారం, 28 జులై 2017 (20:59 IST)
ద్రాక్ష పండ్లు అనారోగ్యంగా వున్నవారికి చాలా ఉపయోగపడుతాయి. అజీర్ణ వ్యాధులు, జ్వరం వచ్చినప్పుడు, లివర్ బలహీనతకు, గుండె బలహీనులకు శ్లేష్మము బహిష్కరింప చేయటానికి రక్తశుద్ధికి, మధుమేహానికి, బరువు తగ్గటానికి, పిచ్చి, హిస్టీరియా తదితర మానసిక వ్యాధులకు మంచి మందులా పనిచేస్తుంది. 
 
ఇంకా నరాల బలహీనత, నిద్రలేమి తదితర వ్యాధులన్నిటిలో ద్రాక్ష పండ్లను తినడం వల్లగాని, ద్రాక్ష రసాన్ని తాగడం వల్ల ఎంతో ఉపయోగకరం. మలబద్ధకానికి కూడా ద్రాక్ష పండ్లు ఉపయోగపడును. రక్తక్షీణత, శ్వేత కుసుమ, రుతుశాల, రుతు సిద్ధము, పైత్యం, ఎక్కిళ్లు, వాంతులు మొదలగు చర్మవ్యాధులకు ద్రాక్షరసంతో మర్దన చేస్తే తగ్గిపోతుంది. జ్వరం, వాంతులు, రక్త క్షీణత కలవారికి ఎండు ద్రాక్ష రాత్రి పూట నానపెట్టి ఉదయం మెత్తగా పిసికి పదిరోజులు తీసుకుంటుంటే రక్తవృద్ధి కలుగుతుంది. 
 
ద్రాక్ష పండ్లలో క్యాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వున్నాయి. ద్రాక్ష విటమిన్ సి ఎక్కువగా వుంటుంది. చాలా తేలికగా జీర్ణమవుతుంది. ఎన్నో దీర్ఘ వ్యాధులను నయం చేస్తుంది. ముఖ్యంగా చర్మ సౌందర్యానికి బాగా ఉపయోగపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొవ్వును కరిగించడమే కాదు.. కంటికి మేలు చేసే ఉల్లికాడలు..