Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాలతో ఉప్పు... పాలు తాగి పనసపండు తింటే ఏమవుతుంది...?

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఐతే పాలను ఎలాగంటే అలా తీసుకోరాదు. చాలామంది ఉదయం వేళ పాలు, అరటిపండు తీసుకుంటుంటారు. పాలతోగాని, పెరుగుతోగాని, పాలపొడితో గాని అరటిపండును తీసుకోవడం సరికాదు. చాలామంది భోజనం తర్వాత అరటి పండు తీసుకుంటారు. ఇది కూడా సరికా

Advertiesment
Milk
, శుక్రవారం, 1 జులై 2016 (20:23 IST)
పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఐతే పాలను ఎలాగంటే అలా తీసుకోరాదు. చాలామంది ఉదయం వేళ పాలు, అరటిపండు తీసుకుంటుంటారు. పాలతోగాని, పెరుగుతోగాని, పాలపొడితో గాని అరటిపండును తీసుకోవడం సరికాదు. చాలామంది భోజనం తర్వాత అరటి పండు తీసుకుంటారు. ఇది కూడా సరికాదు. అరటి పండును తినాలనుకునేవారు భోజనానికి ముందే తీసుకోవాలి. లేదా మధ్యాహ్న భోజనం తర్వాత సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో కడుపు కాస్త ఖాళీ అయ్యాక తీసుకోవడం మంచిది. 
 
రోజూ పాలు తాగేవారు దానితో తీపి పదార్థాలు తప్ప మరే రుచినీ కలపకూడదు. కాబట్టి టీ, కాఫీలు తాగేవారు కేవలం వాటిని కషాయంగా (పాలు కలపకుండా) తాగడమే ఆరోగ్యానికి మంచిది. ఇక ముఖ్యంగా పాలతో ఉప్పు కలపడం ఆరోగ్యానికి అనర్థం. అందుకే పాలతో కలపి సాల్ట్ బిస్కెట్లు తీసుకోవడం మంచిది కాదని గమనించండి. 
 
కొందరు కొన్ని రకాల కూరల్లో పాలు కలిపి వండుతుంటారు. పాలలో ఉప్పు కలిపి వండటం ద్వారా ఆరోగ్యానికి మంచిది కాదని గమనించండి. ఇది హానికరం. ఇక పాలు, పనసపండు కలిపి తినకూడదు. పాలు, చేపలు కలిపి తినకూడదు. చేపలు తిన్న తర్వాత మజ్జిగ గాని, పెరుగు గాని తింటే దీర్ఘకాల రోగాలు తప్పవు. పెరుగును ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి చేయకూడదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నడుము నొప్పి... వదిలించుకునే మార్గాలివే....