తేలు కుట్టిన ప్రదేశంలో బాగా మంటగా ఉంటుంది. కొందరిలో వణుకు, చెమట విపరీతంగా పుట్టడం, వాంతులు, విరేచనాలు కలగవచ్చు. తేలు కుట్టగానే బెత్తెడుపైన గట్టిగా గుడ్డతో కట్టు కట్టాలి.
కట్టును అరగంటకొకసారి తీసి, తిరిగి కట్టు కడుతుండాలి. లేకపోతే రక్త ప్రసరణ జరగక క్రింది భాగం చచ్చుబడిపోయే ప్రమాదం లేకపోలేదు. కుంకుడుకాయ అరగదీసి వచ్చిన ఆ గంధాన్ని తేలు కుట్టిన చోట గాయం మీద రాసి, నిప్పు సెగ చూపితే విషం లాగేసి బాధ నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది.
నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే కుంకుడు గింజలోని పప్పును మింగితే విష ప్రభావం తగ్గుముఖంపడుతుంది. కుంకుడు గింజ ఆసమయంలో తీయగావుంటుందని నిపుణులు తెలిపారు. విషం పారకుండా ఉండటానికి తాత్కాలికంగా ముల్లంగిని తింటే మంచిది.
ఒక కప్పు నీటిలో ఒక చెంచాడు ఉప్పు కలిపి తాగితే బాధ తగ్గిపోతుంది. అలాగే తేలు కుట్టినచోట జిల్లేడు పాలు అద్దినా కూడా విషం పోతుందని వైద్యులు చెపుతున్నారు.