Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముఖారవిందం కోసం కొన్ని బ్యూటీ టిప్స్ మీకోసం...

Advertiesment
Health
, బుధవారం, 20 ఏప్రియల్ 2016 (08:57 IST)
చలికాలంలో కొందరికి శరీరమంత తెల్ల తెల్లగా పొడిబారినట్లు ఉంటుంది. అందులోను కొందరు సహజంగానే పొడిబారిన చర్మం కలిగివుంటారు. వారికి అసలు చెప్పను అవసరం లేదు. ముఖంపైన చలి ఎక్కువ ప్రభావం చూపుట వలన వారు ఒక రకమైన అసౌకర్యానికి గురవుతుంటారు. 
 
* చలికాలంలో పొడిబారిన చర్మ సమస్యవున్న వారి కోసమే ఆరంజ్, తేనె. పోడిబారిన చర్మ సమస్య ఉన్నవారే కాకుండా, జిడ్డు చర్మం వున్నవారు కూడా ఈ రెండిటిని వాడినట్లైతే ఆకర్షణీయమైన మేని మీ సొంతమవుతుంది.
 
* ఎ, సి విటమిన్లు ఎక్కువగా కలిగివున్న పండ్లను ప్రతిరోజు తీసుకొనినట్లైతే చర్మం ఎంతో అందంగా, ఆకర్షణీయంగా మారుతుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. 
 
* సహజంగా చలి వల్ల కలిగే ఈ రకమైన సమస్యను తగ్గించేందుకు ఎక్కువశాతం నీరు తాగుతారు. ఇదీ ఒక రకంగా ఉపయోగపడుతుంది. అయితే ఆరంజ్, తేనె వాడినట్లైతే ఈ సమస్యపైన ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
 
* ఆరంజ్ పండ్లను తినేసి తొక్కలను బయట విసిరివేయకుండా, వాటిని ఎండలో ఎండబెట్టి పౌడర్‌గా చేసుకొని ఆ పౌడర్‌ని నీటిలో కలిపి ముఖానికి, చేతులకు రాసుకొని కొద్దిసేపు తర్వాత శుభ్రం చేసినట్లైతే పొడిబారిన చర్మం ఇట్టే మాయమైపోతుంది.
 
* అదేవిధంగా అర టీ స్పూన్ నిమ్మరసంలో ఒక గ్లాసు వేడి నీటిని, ఒకటి లేక రెండు టీ స్పూన్ తేనె కలిపి ఉదయానె పరగడుపుతో తాగినట్లైతే మేని మిలమిలలాడడమేకాకుండా, శరీరంలో వున్న క్రొవ్వు పదార్థాలు తగ్గి నాజూకుగా తయారవుతారు. 
 
* జిడ్డు చర్మం వున్నవారు రోజ్ వాటర్‌లో దూదిని ముంచి ముఖానికి రాసినట్లైతే చర్మం నిగ నిగలాడుతుంది.
 
* మచ్చలు, గాయాలు వంటి సమస్య ఉన్నవారు టమోటో గుజ్జుతో పాటు పెరుగు కలిపిన మిశ్రమాన్ని, సమస్య ఉన్నచోట రుద్ది ఆరిన తర్వాత శుభ్రపరచినట్లైతే గాయాలు మాయమైపోతుంది.
 
* మొక్కజొన్న పిండి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని ప్రతిరోజు శరీరానికి అప్లై చేసి ఆరిన తర్వాత శుభ్రపరచినట్లైతే శరీరం మిల మిలలాడుతుంది.
 
* బయట వెళ్లేటపుడు ఎండ వల్ల ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు చేతిలో గొడుగు తీసికెళ్ళినట్లైతే సూర్యుని వల్ల కలిగే సమస్యల నుండి తప్పించుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu