Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రుతుక్రమం సమయంలో వ్యాయామం చేయొచ్చా?

రుతుక్రమం సమయంలో వ్యాయామం చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల పొట్టలో క్రాంప్స్ తగ్గుతాయి. అలాగే శరీరం అలసిపోయినప్పుడు ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. 30 నిమిషాల వ్యాయామం వల్ల రక్త ప్రసరణ పెరిగ

రుతుక్రమం సమయంలో వ్యాయామం చేయొచ్చా?
, గురువారం, 13 ఏప్రియల్ 2017 (13:59 IST)
రుతుక్రమం సమయంలో వ్యాయామం చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల పొట్టలో క్రాంప్స్ తగ్గుతాయి. అలాగే శరీరం అలసిపోయినప్పుడు ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. 30 నిమిషాల వ్యాయామం వల్ల రక్త ప్రసరణ పెరిగి, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. భోజనం తర్వాత వ్యాయామం చేయకూడదు. ఆహారం తీసుకున్న తర్వాత వ్యాయామం చేయడం వల్ల జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది. అలాగే పేగులపైనా ప్రభావం పడుతుంది. 
 
ఒబిసిటీకి దూరంగా ఉండాలంటే తృణధాన్యాలు, గుండెకు మేలు చేసే ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి. ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె వంటివి ఆరోగ్యానికి మంచిది. కాబట్టి వీటినే తీసుకోవాలి. ఇందులో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది... ఆరోగ్యానికీ మంచిది. ఒత్తిడి రకరకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ప్రశాంతంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి.
 
ఇక వర్కవుట్‌కి ముందు స్నాక్స్ అయినా తీసుకోవాలి. ఏమీ తినకుండా వర్కవుట్ చేయడం వల్ల బరువు తగ్గడమేగానీ, కండరాల నొప్పులు వస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం వల్ల శరీరంలో మెగ్నీషియం లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.
 
మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యలో ఎక్సర్ సైజ్ చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వ్యాయామం చేయడం వల్ల ఎక్కువ చెమట బయటికి వస్తుంది. తద్వారా బరువు తగ్గుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హడావుడిగా తినొద్దు.. భోజనానికి 20 నిమిషాలైనా కేటాయించండి