Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

Dementia

ఐవీఆర్

, సోమవారం, 30 సెప్టెంబరు 2024 (22:39 IST)
ఆంధ్రప్రదేశ్‌లో డిమెన్షియా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం, రాష్ట్రంలో 60 ఏళ్లకు పైబడిన వ్యక్తుల్లో 7.7% మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు, ఇది జాతీయ సగటు 7.4% కంటే ఎక్కువ. 2036 నాటికి, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 8 లక్షల మంది డిమెన్షియా కేసులు వుండే అవకాశం ఉందని అంచనా. ఇది ప్రత్యేక పునరావాస కేంద్రాలు, నవీన సంరక్షణ నమూనాల అవసరాన్ని వెల్లడి చేస్తోంది.
 
హైదరాబాదులోని గచ్చిబౌలిలోతమ సహాయక నివాస గృహం ద్వారా ఈ సవాలును ఎదుర్కొంటున్న హెచ్ఏసిహెచ్ ఇండియా సమగ్ర సంరక్షణ నమూనాను అందిస్తుంది. హెచ్ఏసిహెచ్ - సీఈఓ, శ్రీ వివేక్ శ్రీవాస్తవ, మాట్లాడుతూ, “రోగులకు సౌకర్యవంతమైన వాతావరణంలో వృత్తిపరమైన సంరక్షణను తీసుకువచ్చి ఆరోగ్య సంరక్షణ రంగంలో మార్పు తీసుకురావటమే తమ లక్ష్యం. మా రోగుల సాంస్కృతిక, భావోద్వేగ అవసరాలను అర్థం చేసుకోవడం ద్వారా, మేము భౌతిక అంశాలను మెరుగుపరచడంపై మాత్రమే దృష్టి పెట్టకుండా, ఒకరి భావోద్వాగాలపై కూడా దృష్టి పెడుతున్నాము. ముఖ్యంగా మా గచ్చిబౌలిలోని సహాయక నివాసంలో, మేము డిమెన్షియా ఉన్న వృద్ధులు కోసం అనుకూలమైన వాతావరణం సృష్టించాము" అని అన్నారు.
 
హెచ్ఏసిహెచ్ సహ వ్యవస్థాపకుడు మరియు సిఓఓ, డాక్టర్ గౌరవ్ తుక్రాల్ మాట్లాడుతూ, “హెచ్ఏసిహెచ్ వద్ద, డిమెన్షియా సంరక్షణ వైద్య లక్షణాలను నిర్వహించడాన్ని మించి ఉంటుంది. మా సమగ్ర దృష్టికోణం రోగులకు భావోద్వేగ, అభిజ్ఞా మద్దతును వారి వ్యక్తిగత అవసరాలకు అనుకూలంగా అందించడాన్ని నిర్ధారిస్తుంది, ఇది వారి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి కీలకం." అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుప్పింటాకా.. మజాకా.. మహిళలకు ఇది దివ్యౌషధం..