Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒంట్లో నీరు చేరిందని డాక్టర్లు చెప్పారా? ఐతే ఇవి తీసుకోండి..

ఒంట్లో నీరు చేరిందని డాక్టర్లు చెప్పారా? అయితే మందులు వాడటం చేస్తున్నారా? అయితే కాస్త ఆపండి. మనం తీసుకునే ఆహారం ద్వారానే ఒంట్లోని నీటిని బయటికి పంపించేయవచ్చు. ఒంట్లో ఉప్పు శాతం తక్కువగా ఉండేలా చూసుకోవ

ఒంట్లో నీరు చేరిందని డాక్టర్లు చెప్పారా? ఐతే ఇవి తీసుకోండి..
, సోమవారం, 20 మార్చి 2017 (17:11 IST)
ఒంట్లో నీరు చేరిందని డాక్టర్లు చెప్పారా? అయితే మందులు వాడటం చేస్తున్నారా? అయితే కాస్త ఆపండి. మనం తీసుకునే ఆహారం ద్వారానే ఒంట్లోని నీటిని బయటికి పంపించేయవచ్చు. ఒంట్లో ఉప్పు శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉప్పులోని సోడియం శరీరంలో అధికంగా నీరుండేలా చేస్తుంది.

శరీరంలోని నీటిని వెలివేయాలంటే.. విటమిన్ బీ6 తప్పకుండా కావాలి. ఈ విటమిన్ పప్పు, చేపలు, డ్రై ఫ్రూట్స్, పాలకూరల్లో పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు అర‌టి పండ్లు, అవ‌కాడోలు, బీన్స్‌, పాల‌కూర వంటి ఆహార ప‌దార్థాల‌ను తీసుకుంటే శ‌రీరంలో అధికంగా ఉన్న నీరు బ‌య‌టికి పోతుంది.
 
నట్స్, ఆకుపచ్చని కూరగాయలు తీసుకోవడం మంచిది. నీటిని కూడా తగిన మోతాదులో తీసుకోవాలి. పంచదార, పిండి పదార్థాలు, ఉప్పు తీసుకోకూడదు. ఇంకా వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే శ‌రీరంలో నిల్వ అయ్యే అధిక నీటి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. 
 
జీల‌క‌ర్ర‌ను నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నా అధిక నీరు శ‌రీరం నుంచి బ‌య‌టికి వెళ్లిపోతుంది. జీలకర్రను రోజూ మీరు తాగే నీటిలో అరస్పూన్ లేదా ఒక స్పూన్ వేసి నానిన తర్వాత ఆ నీటిని తాగితే.. ఒంట్లోని నీరు బయటికి వెళ్తుంది. తద్వారా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేసవిలో ముల్తానీ మట్టి, దోసకాయ గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?