Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆపరేషన్ చేయించుకునే వారు తులసీ ఆకులు తినడం, తులసీ నీటిని తాగితే ఏమవుతుంది?

ఆపరేషన్ చేయించుకునే వారు తులసీ ఆకులు తినడం, తులసీ నీటిని తాగితే ఏమవుతుంది?
, బుధవారం, 7 ఆగస్టు 2019 (19:51 IST)
ఆరోగ్యం విషయంలో తులసి చేసే మేలు చాలా వుంటుంది. ఈ తులసిలో అశ్వం శాంటమ్ అనే పేరున్న రసాయనాలు రక్తాన్ని గడ్డకట్టకుండా ద్రవరూపంలో ఉండేటట్లు చేస్తాయి. తులసీ దళాలు వేసిన నీటిని తాగితే రక్తంలో అడ్డంకులు ఏర్పడవు. ఫలితంగా గుండె, రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా చూడడం వల్ల గుండెపోటు రాకుండా అడ్డుకోవచ్చు. 
 
మెదడుకు సరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకపోవడం వల్ల పక్షపాతం లాంటి జబ్బులను కూడా నివారిస్తుంది. అయితే తులసీ దళాలకు ఉన్న రక్తాన్ని పలుచబరిచే గుణమే ఒక్కోసారి ప్రాణాంతకమవుతుంది. ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్న కండిషన్లో ఉన్నవారు తులసీ ఆకులు మనకు మేలు చేస్తాయన్న భావనలో లేదా భక్తితోనో మిగతా ఆరోగ్యవంతుల్లాగే వాడటం సరికాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
ఏదైనా ఆపరేషన్ చేయించుకునే వారు ముందుగా తులసీ ఆకులు తినడం, తులసీ నీటిని తాగడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే రక్తస్రావం సమయంలో ఆగకుండా నిరంతంరం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. తులసీ ఆకులను ఆరోగ్యం కోసం వాడే వారు అప్పుడప్పుడు ఒకటి రెండు ఆకులను మాత్రమే వాడాలట. లేకుంటే తులసీ ఆకులే ప్రాణాంతకమవుతుందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రి పూట చపాతీలు తింటున్నారా... అయితే?