Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముఖంపై మురికికి పెరుగు ప్యాక్‌తో మటుమాయం!

ముఖంపై మురికికి పెరుగు ప్యాక్‌తో మటుమాయం!
, బుధవారం, 18 మే 2016 (16:39 IST)
వేసవి కాలం వచ్చిందంటే చాలా మంది బయటకు వెళ్లడానికి కూడా ఇష్టపడరు. ముఖం నల్లబడిపోతుందని బయపడుతుంటారు. ఈ కాలంలో ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు మనం తప్పనిసరిగా పాటించాలి. 

పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతివంతంగా మారుతుంది.
 
ఈ సమ్మర్‌లో ఎండ వల్ల చెమట వస్తుంది. దీని వల్ల ముఖం కమిలి పోవడం, ముఖం మండటం జరుగుతుంది. అలాంటప్పుడు పెరుగును ముఖానికి రాసుకుంటే చల్లగా ఉండటమేకాకుండా అందులో ఉండే జింక్ ముఖంలో పేరుకుపోయిన మురికిని పోగొడుతుంది. 
 
ఎండ వల్ల ముఖంలో తేమ తగ్గిపోతుంది. దీని వల్ల చర్మ పొడిబారినట్టు కనిపిస్తుంది. అటువంటి సమయంలో పెరుగును ముఖానికి రాసి చల్లటి నీటితో కడిగేసుకుంటే ముఖం నిగారింపు సంతరించుకుంటుంది. పెరుగులో పెసరపిండి కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్‌కు ప్యాక్‌లా వేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దురదకు కుంకుడు రసంతో చెక్.. మరికొన్ని హెల్త్ టిప్స్