Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పొట్ట పెరిగిపోతోందా? తగ్గాలంటే.. నువ్వులనూనెను ఇలా..?

ఒబిసిటీ ప్రస్తుతం మహిళలను వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారిపోయింది. జంక్ ఫుడ్ పుణ్యంతో ఊబకాయం ఈజీగా వచ్చేస్తోంది. పోషకాహారంపై దృష్టి పెట్టకపోవడంతో పాటు వ్యాయామానికి దూరంగా ఉండటం ద్వారా ఒబిసిటీ ఈజీగా మహి

పొట్ట పెరిగిపోతోందా? తగ్గాలంటే.. నువ్వులనూనెను ఇలా..?
, సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (13:05 IST)
ఒబిసిటీ ప్రస్తుతం మహిళలను వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారిపోయింది. జంక్ ఫుడ్ పుణ్యంతో ఊబకాయం ఈజీగా వచ్చేస్తోంది. పోషకాహారంపై దృష్టి పెట్టకపోవడంతో పాటు వ్యాయామానికి దూరంగా ఉండటం ద్వారా ఒబిసిటీ ఈజీగా మహిళలకు చేరిపోతోంది.

జంక్ ఫుడ్, కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చునే ఉద్యోగాల్లో ఉన్న మహిళలు తప్పకుండా వ్యాయామం చేయాలి. లేకుంటే.. కీళ్ళ నొప్పులు, షుగర్, గుండె జబ్బులతో ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా బరువు తగ్గితేనే ఆరోగ్యం చేకూరుతుందని వారు సూచిస్తున్నారు. 
 
అలా చేసినా పొట్ట తగ్గలేదంటే.. స్నానం చేసే ముందు నువ్వుల నూనెను పొట్టపై రాసుకుంటే పొట్ట తగ్గిపోతుంది. ఉదయం పరగడుపున రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి. ఆపై నువ్వుల నూనెను పొట్టపై రాసి.. 15 నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా చేస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. నిత్యం పిల్లలకు స్నానానికి ముందు నువ్వుల నూనె రాస్తే.. పిల్లల ఎదుగుదల సులువవుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. 
 
ఇంకా నువ్వుల నూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం ద్వారా బీపీ కంట్రోల్ అవుతుంది. అందుకే కొవ్వు పేరుకుపోయిన శరీర భాగాలపై నువ్వుల నూనెను రాస్తే కొవ్వు కరిగిపోతుంది. అలాగే నువ్వుల నూనెలో విటమిన్ ఈ, బీలు ఉండటం ద్వారా చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. నువ్వుల నూనె చర్మానికి రాసుకోవడం ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది. మృదువుగా తయారవుతుంది. చుండ్రు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్లలపై ఎండ పడనీయకుండా జాగ్రత్తలు పడుతున్నారా? ఐతే కష్టమే