Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉప్పులేని వేయించిన వేరు శెనగ తీసుకుంటే..?

రక్తపోటును నియంత్రించాలంటే శరీరంలో క్యాల్షియం స్థాయి తగినంతగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందుకుగాను రక్తపోటు సమస్య ఉన్నవారు రోజూ క్యాల్షియం సమృద్ధిగా అందే కొవ్వు లేని వెన్న తీసిన పాలు, పాల ఉత్పత

ఉప్పులేని వేయించిన వేరు శెనగ తీసుకుంటే..?
, బుధవారం, 21 సెప్టెంబరు 2016 (16:10 IST)
రక్తపోటును నియంత్రించాలంటే శరీరంలో క్యాల్షియం స్థాయి తగినంతగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందుకుగాను రక్తపోటు సమస్య ఉన్నవారు రోజూ క్యాల్షియం సమృద్ధిగా అందే కొవ్వు లేని వెన్న తీసిన పాలు, పాల ఉత్పత్తులు వంటివి తీసుకోవాలి. పెరుగు రోజూ తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రించవచ్చు. అలాగే రక్తపోటు గల వారు ప్రతిరోజూ ఆరోగ్య నిబంధనల ప్రకారం 3,500 మి.గ్రా పొటాషియం శరీరానికి అందించాల్సి ఉంటుంది. 
 
శరీరానికి కావాల్సిన పొటాషియం అందాలంటే అరటిపండ్లు, బత్తాయి, దోసకాయ, టమాటాలు, ఉప్పు లేకుండా వేయించిన వేరు శెనగ, బీన్స్, బంగాళాదుంపలు, మునగాకు, కొత్తిమీర వంటివి తీసుకోవాలి. వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా రక్తపోటును నియంత్రించాలంటే ముఖ్యంగా రోజువారీ ఆహారంలో తాజా కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లు, గింజలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రేక్ ఫాస్ట్‌కు ఒకటి.. భోజనానికొకటి.. డిన్నర్‌కు మరొకటి.. రోజుకు 3 అరటిపండ్లు తింటే?