పూర్వకాలంలో అబార్షన్ ఎలా చేయించుకునేవారో తెలుసా? నిమ్మకాయ తొక్కల్ని జననాంగాల వద్ద..?!
ఈ ఆధునిక కాలంలో గర్భాన్ని తొలగించుకోవడం కోసం స్త్రీలు అబార్షన్ చేయించుకోవడం.. ఇంకా వేర్వేరు పద్ధతుల ద్వారా గర్భాన్ని తొలగించుకుంటున్నారు. కాని పూర్వకాలంలో అలా కాదు. ఆ కాలంలో దంపతులు ఒకరు కాదు ఇద్ద
ఈ ఆధునిక కాలంలో గర్భాన్ని తొలగించుకోవడం కోసం స్త్రీలు అబార్షన్ చేయించుకోవడం.. ఇంకా వేర్వేరు పద్ధతుల ద్వారా గర్భాన్ని తొలగించుకుంటున్నారు. కాని పూర్వకాలంలో అలా కాదు. ఆ కాలంలో దంపతులు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడేసి, ఎనిమిదేసి... ఇంకొందరు పదుల సంఖ్యలో కూడా పిల్లల్ని కనేవారు.
అప్పుడు జనాభా నియంత్రణ, గర్భం రాకుండా నిరోధించడం వంటి పద్ధతులపై అప్పటి ప్రజల్లో సరైనా అవగాహన లేదు. కానీ కేవలం కొద్ది మంది మాత్రమే ఆ పద్ధతులను పాటించేవారు. వారి సంఖ్య కూడా చాలా తక్కువే. అయితే వారు గర్భం రాకుండా ఉండేందుకు అప్పటివారు ఉపయోగించిన పద్ధతులను చూస్తే ఇప్పటి వారు ఖంగుతినాల్సిందే. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పూర్వం నిమ్మకాయ తొక్కలను అప్పట్లో కొందరు మహిళలు తమ జననాంగాల వద్ద పెట్టుకునేవారట. దాంతో నిమ్మరసం ఆ ప్రదేశమంతా వ్యాపించి అందులో ఉండే సిట్రిక్ యాసిడ్ అక్కడికి వచ్చి చేరే శుక్ర కణాలను నాశనం చేస్తుందట. దీంతోపాటు ఆ ప్రదేశంలో ఉన్న బాక్టీరియా అంతా నశిస్తుందని కూడా వారు నమ్మేవారు. ఈ పద్ధతి వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని వారి నమ్మకం.
అకాసియా అనే ఓ మొక్కకు చెందిన ఆకులను తేనె, ఖర్జూరం కలిపిన మిశ్రమంలో నానబెట్టి వాటిని టాంపన్స్ అని పిలవబడే బిరడాల వంటి సహాయంతో కొందరు ఈజిప్షియన్ మహిళలు తమ యోనిలో పెట్టుకునేవారట. ఈ పద్ధతి వీర్యాన్ని నాశనం చేసే స్పెర్మిసైడ్గా పనిచేస్తుందని వారంటున్నారు. పంది పేగులను వేడి పాలలో నానబెట్టి వాటిని శుద్ధి చేసి కొందరు పురుషులు వాటిని కండోమ్లుగా అప్పట్లో ఉపయోగించేవారట.వినడానికే వింతగా ఉన్న ఇది నిజం.