Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బరువు తగ్గాలనుకుంటున్నారా? రెండు గ్లాసులు నీళ్లే చాలు..

బరువు తగ్గాలనుకునుకుంటున్నారా? వ్యాయామాలు చేసేస్తున్నారా? ఇకపై ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం రెండు గ్లాసుల నీరు చాలు. ఇదేంటి అనుకుంటున్నారా? ఈ స్టోరీ చదవండి. భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు తా

బరువు తగ్గాలనుకుంటున్నారా? రెండు గ్లాసులు నీళ్లే చాలు..
, గురువారం, 13 అక్టోబరు 2016 (11:58 IST)
బరువు తగ్గాలనుకునుకుంటున్నారా? వ్యాయామాలు చేసేస్తున్నారా? ఇకపై ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం రెండు గ్లాసుల నీరు చాలు. ఇదేంటి అనుకుంటున్నారా? ఈ స్టోరీ చదవండి. భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు తాగితే సులభంగా బరువు తగ్గుతారని లండన్ పరిశోధకులు తేల్చారు. భోజనానికి ముందే నీరు తాగడం వల్ల కడుపు నిండిన అనుభూతి పొందుతారని దీంతో ఆహారం తక్కువగా తింటారని తద్వారా బరువు తగ్గుతారని తేలింది.
 
ప్రాథమిక ఆధారాలతో బర్మింగ్‌హామ్ వర్శిటీకి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇలా భోజనానికి ముందు నీరు తాగేవారు 3 నెలల్లోనే 4కిలోల బరువు తగ్గారని అధ్యయనం తేల్చినట్లు లండన్‌కి చెందిన ‘ఒబెసిటి’ జర్నల్‌ ప్రచురించింది. దీని ద్వారా ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా సులభంగా బరువు తగ్గవచ్చని పరిశోధకులు అంటున్నారు. 
 
కాగా, ప్రస్తుతం 5–17 ఏళ్ల వయస్సున్న 268 మిలియన్ల పిల్లలు 2025 వరకు అధిక బరువుతో బాధపడే అవకాశం ఉందని వరల్డ్‌ ఒబెసిటి ఫెడరేషన్‌ హెచ్చరించింది. వీరిలో 98 మిలియన్ల మంది స్థూలకాయం బారిన పడే అవకాశముందని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొబ్బరి బొండాలను కూడా కల్తీ చేస్తున్నారట