Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేసవి కాలం... భోజనం చేసిన వెంటనే ఐస్ వాటర్ తాగితే?

అసలే బండలు పగిలే వేసవికాలం. దీనితో ఇంట్లోకి రాగానే చటుక్కున ఫ్రిడ్జ్ డోర్ తీసేసి చల్లని ఐస్ వాటర్ తాగేస్తుంటారు. ఆ తర్వాత భోజనం చేస్తూ ఐస్ వాటర్ తాగేస్తుంటారు. ఇందుకోసం ఫ్రిజ్‌లలో వాటర్ బాటిల్స్‌లలో నీటిని నింపి.... బాగా కూల్ అయ్యేంతవరకు ఉంచుతుంటారు.

వేసవి కాలం...  భోజనం చేసిన వెంటనే ఐస్ వాటర్ తాగితే?
, బుధవారం, 24 మే 2017 (16:04 IST)
అసలే బండలు పగిలే వేసవికాలం. దీనితో ఇంట్లోకి రాగానే చటుక్కున ఫ్రిడ్జ్ డోర్ తీసేసి చల్లని ఐస్ వాటర్ తాగేస్తుంటారు. ఆ తర్వాత భోజనం చేస్తూ ఐస్ వాటర్ తాగేస్తుంటారు. ఇందుకోసం ఫ్రిజ్‌లలో వాటర్ బాటిల్స్‌లలో నీటిని నింపి.... బాగా కూల్ అయ్యేంతవరకు ఉంచుతుంటారు. 
 
అయితే ఇలాంటి ఐస్ వాటర్ తాగడం చాలా ప్రమాదకరమైనదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆహారం తిన్న వెంటనే చల్లని నీటిని సేవించడం వల్ల మనం తీసుకున్న ఆహారంలోని ఆయిల్ పదార్థాలను ఆ చల్లని నీరు గడ్డకట్టుకునేలా చేస్తాయని చెపుతున్నారు. 
 
దీనివల్ల తిన్న ఆహారం జీర్ణం కాదని అంటున్నారు. అంతేకాకుండా, శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను కూడా అధిక శాతానికి పెంచుతాయట. ఇదే పరిస్థితి కొనసాగినట్టయితే హృద్రోగ, మూత్ర సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హృద్రోగులు చల్లని నీటిని తాగరాదని సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆహారానికి అర్థగంట ముందు సబ్జా గింజలు తింటే...