Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంజీర పండు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Advertiesment
అంజీర పండు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
, బుధవారం, 19 అక్టోబరు 2022 (22:26 IST)
అంజీర ప్రయోజనాలు, అత్తి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాము. అత్తి పండ్లలో విటమిన్ ఎ, బి, సి, కెతో పాటు కార్బోహైడ్రేట్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి ఉంటాయి. అంజీర పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తహీనతను నివారిస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.
 
అత్తి పండ్లలో జీర్ణక్రియకు సహాయపడే డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం, అసిడిటీని నివారిస్తుంది. అత్తి పండ్లను, వాటి ఆకులలోని సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని సమతుల్యం చేస్తాయి. భోజనానికి ముందు, ఆ తర్వాత సరైన మోతాదులో అంజీర పండ్లను తినడం వల్ల పైల్స్ వంటి వ్యాధులు నయమవుతాయి.
 
పురుషులు అత్తి పండ్లను తినడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. అత్తిపండ్లలో జింక్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అంజీరలో వుండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ హార్మోన్ల అసమతుల్యత, రుతుక్రమ సమస్యల నుండి బైట పడేస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వళ్లు నొప్పులు వదిలించుకునే మార్గాలు