Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నానబెట్టిన బాదం పప్పుల్ని తింటే.. వృద్ధాప్యఛాయలు తగ్గిపోతాయట..

బాదం పప్పుల్ని అలాగే తీసుకునే కంటే రాత్రి పూట నానబెట్టి ఉదయం పూట తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్చివాటితో పోలిస్తే నానబెట్టిన బాదం తీసుకోవడం వల్ల వృద

నానబెట్టిన బాదం పప్పుల్ని తింటే.. వృద్ధాప్యఛాయలు తగ్గిపోతాయట..
, గురువారం, 22 డిశెంబరు 2016 (13:42 IST)
బాదం పప్పుల్ని అలాగే తీసుకునే కంటే రాత్రి పూట నానబెట్టి ఉదయం పూట తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్చివాటితో పోలిస్తే నానబెట్టిన బాదం తీసుకోవడం వల్ల వృద్ధాప్యఛాయలు తగ్గుతాయని వారు సూచిస్తున్నారు.

బాదంలో పీచు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, మెగ్నీషియం పుష్కలంగా ఉండటం ద్వారా.. వాటిని నానబెట్టి తీసుకుంటే పొట్ట నిండిన భావన కలుగుతుంది. మోనోశాచురేటెడ్‌ కొవ్వే ఇందుకు కారణం. బరువు తగ్గాలనుకునేవారికి మంచి పోషకాహారమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇక.. నానబెట్టిన బాదం తినేముందు తప్పకుండా వాటి పొట్టు తీయాలి. ఉదయం పూట ఇవి తింటే గనుక బాదంలోని ఎంజైములు జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తాయి. జీర్ణవ్యవస్థ పని తీరును వృద్ధిచేసి ఉదర సంబంధిత సమస్యలు బాధించవు. రక్తపోటు అధికంగా ఉన్నవారు కూడా నానబెట్టిన బాదం పప్పుల్ని తీసుకోవచ్చు.

ఇందులోని పోషకాలు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. గర్భిణులు వీటిని తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువుకు ఫోలిక్‌ యాసిడ్‌ సమృద్ధిగా అందుతుంది. బిడ్డ ఎదుగుదలలో లోపాలు తలెత్తవు. తల్లీబిడ్డలకు ఇది మేలు చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెల్లుల్లితో కాచిన పాలను ఉదయం, రాత్రిపూట తాగితే...