అర నిమ్మ చెక్కపై చక్కెర చల్లి మోచేతులు, మెడ చుట్టూ, చేతులపై మెత్తగా రుద్దితే చర్మంపై పేరుకుపోయిన మురికి తొలగిపోయి, చర్మం మృదువుగా మారుతుంది.
పచ్చి బంగాళాదుంప జ్యూస్ తీసుకుని నల్లబారుతున్న చర్మంపై రుద్దితే చర్మం మృదువుగానూ, శుభ్రంగానూ ఉంటుంది.
పాల మీగడ, రోజ్ వాటర్ కలిపి చేతులతో చర్మంపై మసాజ్ చేస్తే చర్మకాంతిని బంగాళాదుంప ఇనుమడింపజేస్తుంది.
పాలు, తేనెను కలిపి మెడభాగంలో, చేతులు, కాళ్లకు పట్టిస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
బొప్పాయిపండు గుజ్జును చర్మంపై రుద్దితే అందులోనున్న మురికి మటుమాయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.