Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రేక్ ఫాస్ట్‌లో బీన్స్, మొలకెత్తిన గింజలు తీసుకుంటే ఫలితం ఏమిటి?

బ్రేక్ ఫాస్ట్ మానేసిన మహిళలకైతే ఉద్యోగ జీవితంలో విధుల నిర్వహణలో తెలియని ఒకరకమైన చిరాకు వేధిస్తుంది. అదే చిన్నపిల్లలైతే స్కూల్లో చురుకుదనంతో ఉండరు. కాబట్టి, ఉదయంపూట తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్‌ ప్రతి ఒక్

బ్రేక్ ఫాస్ట్‌లో బీన్స్, మొలకెత్తిన గింజలు తీసుకుంటే ఫలితం ఏమిటి?
, మంగళవారం, 27 డిశెంబరు 2016 (12:17 IST)
బ్రేక్ ఫాస్ట్ మానేసిన మహిళలకైతే ఉద్యోగ జీవితంలో విధుల నిర్వహణలో తెలియని ఒకరకమైన చిరాకు వేధిస్తుంది. అదే చిన్నపిల్లలైతే స్కూల్లో చురుకుదనంతో ఉండరు. కాబట్టి, ఉదయంపూట తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్‌ ప్రతి ఒక్కరికీ అవసరం. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో బీన్స్‌, మొలకెత్తిన గింజలు లాంటివి తీసుకునేవారు చాలా చురుగ్గా ఉంటారు. చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
బ్రేక్ ఫాస్ట్‌లో పాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ఆకుకూరలు లాంటివి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇకపోతే, పొద్దున్నే బేకరీలలో తయారైన వస్తువులను తినకపోవడం మంచిది. ఎందుకంటే ఇవి ఫాటీ యాసిడ్స్‌ను కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేయకపోవడమే కాకుండా, వీటిలోని క్యాన్సర్‌ కారకాలు శరీరానికి హాని చేస్తాయి.
 
అలాగే మధ్యాహ్నం భోజనంలో కోడిగుడ్లను ప్రతిరోజూ తీసుకుంటే చాలామంచిది. కోడిగుడ్డు నుండి మన శరీరం స్యూరో ట్రాన్స్‌మీటర్స్‌ను తయారు చేసుకుంటుంది. ఎసెటిల్కోలైన్‌ దీనికి చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది గనుక శరీరంలో లోపిస్తే ఆల్జిమర్స్‌ వ్యాధి వస్తుంది. 
 
అంతేగాకుండా న్యూరో ట్రాన్స్‌మీటర్స్‌ మన మేధో శక్తిని పెంచుతాయి. మెదడును ఉత్తేజపూరితం చేసి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మధ్యాహ్నం పూట ఆహారంలో పెరుగును తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో ఉండే అమినో యాసిడ్లు ఒత్తిడిని తట్టుకునేందుకు దివ్య ఔషధాలుగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జబ్బు, దగ్గును తగ్గించే సపోటా.. కిడ్నీలో రాళ్ళను కూడా తొలగిస్తుందట..