Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చేపలు, పాలు, నట్స్‌ కంటే ఆ పండు ఎంతో ఉత్తమం

ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వివిధ రకాల పండ్లూ ఆరగిస్తుంటారు. ముఖ్యంగా భోజనం చేశాక అరటి పండును ఆరగించడం చాలా మందికి అలవాటు ఉంటుంది. అయితే, అరటి పండు చేపలు, పాలు, నట్స్ (ఎండు ఫలాలు) కంటే ఎంతో బలవర్

చేపలు, పాలు, నట్స్‌ కంటే ఆ పండు ఎంతో ఉత్తమం
, గురువారం, 8 జూన్ 2017 (16:41 IST)
ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వివిధ రకాల పండ్లూ ఆరగిస్తుంటారు. ముఖ్యంగా భోజనం చేశాక అరటి పండును ఆరగించడం చాలా మందికి అలవాటు ఉంటుంది. అయితే, అరటి పండు చేపలు, పాలు, నట్స్ (ఎండు ఫలాలు) కంటే ఎంతో బలవర్ధక ఆహారమని పరిశోధకులు చెపుతున్నారు. 
 
ప్రతి రోజూ అరటి పళ్లు తీసుకోవడం ద్వారా గుండె లయ తప్పకుండా కొట్టుకుంటుందట. అరటిలో ఫైబర్‌తో పాటు పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. అలాగే, ఇందులోవుండే పొటాషియం గుండె కొట్టుకోవడంలో ఎంతగానో ఉపకరిస్తుంది. గుండెను భద్రంగా ఉంచడంలోనే కాదు రక్తపోటును కూడా పొటాషియం అదుపులో ఉంచుతుంది. ఒక్కో అరటి పండులో 467 ఎంజి పొటాషియం లెవల్స్‌ ఉంటాయి.
 
ఇకపోతే... శరీరానికి హాని చేసే సోడియం ఒక ఎంజి మాత్రమే ఉంటుంది. పొటాషియం లెవల్స్‌ ఎక్కువగా ఉండే చేపలు, పాలు, నట్స్‌ తీసుకోవడం కంటే.. రోజూ ఒకటో, రెండో అరటిపళ్లు తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. అలాగే, తరుచూ అరటిపళ్లు తినేవారి గుండె పనితీరు మిగతావారితో పోలిస్తే బాగుందని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ చేపట్టిన స్టడీలోనూ వెల్లడైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నం తినేందుకు ముందు ఆకలేస్తే నట్స్ నమిలేయండి..