Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధుమేహ రోగులు : ఆహార నియమాలు

మధుమేహ రోగులు : ఆహార నియమాలు
మధుమేహంతో బాధపడే రోగులు ఖచ్చితంగా ఆహార నియమాలను పాటించి తీరాలి. అప్పుడే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఈ వ్యాధిబారినపడినవారు ఆహార నియమం గురించి పడే తపన అంతా ఇంతా కాదు. దీనికి పడే ఒత్తిడి వారిలో అధికంగా ఉంటుంది. దీనికి ముందుగానే ఆహార నియమం కోసం కొన్ని ప్రణాళికలను ముందుగానే తయారు చేసుకుంటే చాలా మంచిది. అలాంటి ప్రణాళికా నియమాలు ఇలా ఉండాలంటున్నారు వైద్యులు.

ఉదయం 6 గంటలకు : అర చెంచా మెంతి పొడిని నీటిలో కలిపి సేవించండి.

ఉదయం 7 గంటలకు : టీ తాగే అలవాటుంటే చక్కెర లేని టీతోబాటు రెండు మేరీ బిస్కత్తులు తీసుకోండి.

ఉదయం 8.30 గంటలకు : ఒక ప్లేటు ఉప్మా లేదా గోధుమ రవ్వతో చేసిన ఉప్మాతోబాటు అరకప్పు మొలకెత్తిన విత్తనాలు, 100 మిల్లీలీటర్ల చక్కెరలేని పాలను ఆహారంగా తీసుకోండి.

ఉదయం 10.30 గంటలకు : ఒక 50గ్రాములున్న పండు లేదా 1 కప్పు పలుచటి మజ్జిగ లేదా చక్కెర లేకుండా నిమ్మకాయ రసంను సేవించండి.

మధ్యాహ్నం భోజనం 12.30 గంటలకు : రెండు చపాతీలు, ఒక కప్పు గంజి తీసివేసిన అన్నం, ఒక కప్పు పప్పు, ఒక కప్పు పెరుగు, అర కప్పు సోయాబీన్ లేదా పనీర్, అరకప్పు ఆకుకూరతోబాటు సలాడ్ ఒక కప్పును ఆహారంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు.

సాయంత్రం 4 గంటలకు : ఒక కప్పు చక్కెర లేని టీతోబాటు రెండు మేరీ బిస్కత్తులు ఆహారంగా తీసుకోవాలి.

సాయంత్రం 6 గంటలకు : ఒక కప్పు సూపు తీసుకోండి.

రాత్రి భోజనం 8.30 గంటలకు : మధ్యాహ్నం తీసుకున్న ఆహారం మాదిరాగానే రాత్రిపూటకూడా ఆహారం తీసుకోవాలి.

రాత్రి పడుకునే సమయంలో 10.30 గంటలకు : ఒక కప్పు చక్కెర లేని పాలు సేవించండి.

ఒక్కసారిగా ఆహారాన్ని సమపాళ్ళల్లో తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత విపరీతంగా ఆకలి వేస్తుంటుంది. అలా ఆకలి వేస్తే ఈ సూత్రాలు పాటించండి.

పచ్చి కూరగాయలు సలాడ్‌గా తీసుకోండి. బ్లాక్ టీ, సూప్, పలుచటి మజ్జిగ, నిమ్మకాయ రసం సేవిస్తుండండి. ఇందులో ముఖ్యంగా చక్కెర, బెల్లం, తేనె, తీపి పదార్థాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu