Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేడ్ ఇన్ ఇండియా... 12 ఇంపార్టెంట్ పాయింట్స్

Advertiesment
మేడ్ ఇన్ ఇండియా
, శుక్రవారం, 9 నవంబరు 2012 (21:57 IST)
WD
1. గత వెయ్యేళ్ళలో ఎన్నడూ భారతదేశం మరో దేశం మీద తనంత తానుగా దాడిచేయలేదు.
2. ప్రపంచానికి అంకెలు అందించింది భారతదేశం. ఆర్యభట్ట సున్నాని కునుగొన్నాడు.
3. ప్రపంచంలో తొలి విశ్వవిద్యాలయమైన తక్షశిల క్రీస్తుపూర్వం 700 సంవత్సరంలోనే ఇక్కడ ఏర్పాటైంది. ఆనాడే అక్కడ 60కి పైగా విజ్ఞాన విభాగాలలో బోధన వుండేది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి పదివేల మందికి పైగా విద్యార్థులు వచ్చి చదువుకునే వారు. క్రీస్తు పూర్వం నాల్గవ శతాబ్దంలో నలంద విశ్వవిద్యాలయం నిర్మించారు. విద్యారంగంలో భారతదేశం సాధించిన ఘనత అది.

4. ఫోర్బ్స్ పత్రిక ప్రకారం కంప్యూటర్ భాషకు తగిన భాష సంస్కృతం మాత్రమే.
5. ఈ లోకానికి అందించబడిన తొలి వైద్యవిధానం ఆయుర్వేదం.
6. నౌకాయానం సింధునదిలో 5000 సంవత్సరాల క్రితమే భారతీయులు నేర్చుకున్న కళ.
7. ఇంగ్లీష్‌లోని నావిగేషన్ అనే పదం సంస్కృతంలోని నావగతిలో నుండి తీసుకున్నారు.
8. పై (pi) విలువను బుద్ధయానుడు గుణించాడు. నేడు పైథాగరస్ సిద్ధాంతంగా చెప్పే దాని మూలసూత్రాలను ఆయన ఆనాడే వివరించాడు. ఐరోపా శాస్త్రవేత్తలు ఓనామాలు నేర్వని రోజుల్లో అంటే 6వ శతాబ్దంలోనే బుద్ధయానుడు గణితశాస్త్రం రూపొందించాడని బ్రిటీష్ పరిశోధకులు అంగీకారించారు.

9. ఆల్జీబ్రా, కేలక్యులస్, ట్రిగ్నామెట్రీలు భారతదేశంలో పుట్టినవే. క్వాడ్రాటిక్ సూత్రాలు 11వ శతాబ్దంలో శ్రీధరాచార్య రూపొందించారు.
10. జెమలాజికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అమెరికా వారి ప్రకారం 1896 వరకు వజ్రాల ఉత్పత్తి తెలిసిన ఏకైక దేశం భారతదేశం.
11. వైర్‌లెస్ సమాచార వ్యవస్థను రూపొందించింది మార్కొని కాదని, ప్రొఫెసర్ జగదీష్ అని అమెరికాలోని ఐ.ఇ.ఇ.ఇ వారు దృవీకరించారు.
12. శస్త్ర చికిత్సకు ఆద్యుడు శుశ్రుతుడు. 2600 సంవత్సరాల క్రితమే శుక్లాలు, మూత్రపిండాల రాళ్ళు తొలగింపు, శస్త్రచికిత్సలు ఆయన చేశాడు. నేటి సిజేరియన్ ఆపరేషన్ ఆయన నాడే చేశాడు. విరిగిన ఎముకలను అతికించేవాడు.

Share this Story:

Follow Webdunia telugu