పిల్లలూ ఇనుముకు తుప్పు ఎందుకు పడుతుందో తెలుసా?
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2011 (11:59 IST)
ఇనుము తుప్పు పట్టేందుకు ముఖ్యకారణం ఆక్సిజన్. నీటిలో తడిసినప్పుడు కానీ, గాలిలోని నీటిఆవిరి చుట్టూ పేరుకున్నప్పుడు గానీ ఇనుము నీటితో చర్య జరుపుతుంది. అంటే ఇనుము (ఫెరస్-Fe) నీటి (H2O) లోని ఆక్సిజన్ (O2) ను తీసేసుకుని హైడ్రోజన్ (H2) ను గాల్లోకి వదిలేస్తుంది. ఇనుము, ఆక్సిజన్ రెండూ కలిసి ఫెర్రస్ ఆక్సైడ్ (తుప్పు) తయారై ఇనుముపై పేరుకుంటుంది. తుప్పు పొడిపొడిగా ఉండి మిగిలిన ఇనుముతో సంబంధంకలిగి ఉండదు. దాంతో రాలి కిందపడిపోతుంది. అంటే తుప్పుపడితే ఆ పదార్థం బరువు క్రమేపీ తగ్గుతూ కొన్ని రోజులకు పదార్థం మొత్తం విడిపోతుంది. దీనివల్లనే ఇనుపపదార్ధాలకు తుప్పు పట్టకుండా పెయింట్, నూనె, గ్రీజు లాంటివి పూస్తారు. ఇవి ఇనుముకు, నీరు-నీటిఆవిరికి మధ్యన ఉండి ఇనుము, ఆక్సిజన్ కలవకుండా చేస్తాయి.