కావలసిన వస్తువులు :
గోధుమ పండి : 300 గ్రాములు
సోయా పిండి : 2 టేబుల్ స్పూను
పరాటా మిశ్రమం కోసం : కాటేజ్ చీజ్ (తురుము) 150 గ్రాములు
పచ్చిమిర్చి : సన్న ముక్కలు 5
ఉల్లిపాయ : సన్న ముక్కలు ఒకటి
గరంమసాలా : చిటికెడు
నూనె : 2 టేబుల్ స్పూన్లు
ఇలా చెయ్యండి :
గోధుమపిండి, సోయాపిండి నీళ్ళలో చపాతీ పిండిలా కలపాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, చీజ్, ఉప్పు, గరంమసాలా బాగా కలపాలి. నిమ్మకాయ సైజులో పిండిని తీసుకుని చీజ్ కలిపిన ఉల్లిముక్కల మిశ్రమాన్ని అందులో పెట్టి, పరాటలా చేయాలి. పెనం వేడిచేసి కొద్దిగా నూనెవేసి, పరాటాను రెండువైపులా కాల్చాలి. వీటిని వేడివేడిగా పెరుగుపచ్చడితో తింటే బాగుంటుంది.