Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రేక్‌ఫాస్ట్‌గా ఎప్పుడూ అట్టూ, ఇడ్లీయేనా...? కల్లప్పం కాస్త టేస్ట్ చేసి చూడండి...

ఇంట్లో సాధారణంగా దోసె, ఇడ్లీ అంతగా కాదంటే ఉప్మా ఇవే చేస్తుంటారు. వీటిని పిల్లలు తినీతినీ విసిగిపోయి తమకు వేరే కొత్త వంటకం కావాలని మారం చేస్తుంటారు. వాళ్లు మారాం చేసేదాకా ఎందుకు...? కొత్త వంటకాలను వారికి రుచి చూపిస్తే పోతుంది కదా. కేరళలో టేస్టీగా చేసు

Advertiesment
breakfast special
, శుక్రవారం, 5 మే 2017 (12:42 IST)
ఇంట్లో సాధారణంగా దోసె, ఇడ్లీ అంతగా కాదంటే ఉప్మా ఇవే చేస్తుంటారు. వీటిని పిల్లలు తినీతినీ విసిగిపోయి తమకు వేరే కొత్త వంటకం కావాలని మారం చేస్తుంటారు. వాళ్లు మారాం చేసేదాకా ఎందుకు...? కొత్త వంటకాలను వారికి రుచి చూపిస్తే పోతుంది కదా. కేరళలో టేస్టీగా చేసుకుని కల్లప్పం తయారీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు
బియ్యం - 200 గ్రాములు, డ్రై ఈస్ట్- అర టీస్పూను, ఉప్పు - 5 గ్రాములు, కొబ్బరి తురుము - అరకప్పు, మెంతులు - అర టీస్పూను, వెల్లుల్లి - 5 గ్రాములు, ఉల్లిపాయలు - 10 గ్రాములు, పంచదార -20 గ్రాములు, కొబ్బరి పాలు - 100 మి.లీ
 
తయారీవిధానం... 
బియ్యం రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే మెత్తగా రుబ్బుకోవాలి. ఈ బియ్యం ముద్దలో 50 గ్రాములు తీసుకుని కొద్దిగా నీరు చేర్చి జారుడుగా తయారుచేసుకోవాలి. దీన్ని పొయ్యిమీద పోసి ఉండకట్టకుండా వుడికించుకోవాలి. 
 
వెల్లుల్లి, ఉల్లిపాయలు, కొబ్బరి, మెంతులు కొద్దిగా దంచుకోవాలి. మిగిలిన ముద్దలో వీటిని వేసి ఉప్పు, పంచదార, ఈస్ట్, కొబ్బరిపాలు, ఉడికించిన బియ్యం వేసి కలపాలి. దీన్ని నాలుగైదు గంటలపాటు పక్కనుంచాలి. తర్వాత ఈ పిండితో దోశలు పోసి చికెన్ లేదా ఎగ్ రోస్టుతో తింటే భలే రుచిగా వుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెక్సియెస్ట్ బెల్లీ కోసం అమ్మాయిలు పాట్లు... అలాక్కావాలంటే...?