Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విదిశలో సుష్మా స్వరాజ్ : ఝాన్సీలో ఉమా భారతి నామినేషన్!

విదిశలో సుష్మా స్వరాజ్ : ఝాన్సీలో ఉమా భారతి నామినేషన్!
, శుక్రవారం, 4 ఏప్రియల్ 2014 (16:14 IST)
File
FILE
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను బీజేపీ మహిళా సీనియర్ నేతలు సుష్మా స్వరాజ్, ఉమా భారతిలు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులోభాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిశ లోక్‌సభ స్థానానికి సుష్మా స్వరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఆమె వెంట మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఇతర రాష్ట్రాల బీజేపీ నేతలు ఉన్నారు.

అలాగే, ఫైర్ బ్రాండ్, బీజేపీ నేత ఉమాభారతి ఇవాళ ఝాన్సీ పార్లమెంటరీ నియోజకవర్గంలో నామివేషన్ వేశారు. ఏప్రిల్ 30న ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్నాయి. తన మద్దతుదారులతో కలెక్టరేట్‌కు చేరుకున్న ఉమా భారతి మూడు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆమె వెంట ఎమ్మెల్యే రవిశర్మ, మాజీ మంత్రి రవీంద్ర శుక్లా తదితరులున్నారు.

Share this Story:

Follow Webdunia telugu