Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజ్‌నాథ్ - రాజేలు నమ్మక ద్రోహులు : జశ్వంత్ సింగ్

Advertiesment
జశ్వంత్ సింగ్
, సోమవారం, 24 మార్చి 2014 (16:46 IST)
File
FILE
బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియాలు నమ్మక ద్రోహులని ఆ పార్టీ తిరుగుబాటు నేత, బార్మర్ లోక్‌సభ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన జశ్వంత్ సింగ్ ఆరోపించారు.

బీజేపీ టికెట్ లభించకపోవడంతో బార్మర్ నియోజకవర్గం నుంచి ఇండింపెండెంట్‌గా సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే తన పట్ల నమ్మకద్రోహం తలపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్‌నాథ్‌ను పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపాదించానని, వసుంధరాను సీఎంగా సూచించానని... కానీ, వీరిద్దరూ తనకు టికెట్ దక్కకుండా చేశారని ఆరోపించారు. తిరిగి బీజేపీలోకి రమ్మని అద్వానీ, గడ్కారి అడిగారని... అయితే, తన కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించడంలేదని జశ్వంత్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu