Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తలరాత మార్చేందుకు మోడీకి ఓటేయండి : అద్వానీ

Advertiesment
అద్వానీ
, మంగళవారం, 1 ఏప్రియల్ 2014 (12:19 IST)
File
FILE
దేశం తలరాత మార్చేందుకు నరేంద్ర మోడీకి ఓటు వేయాలంటూ బీజేపీ అగ్రనేత ఎల్కే.అద్వానీ పిలుపునిచ్చారు. మార్పు కావాలంటే మోడీకి ఓటు వేయాలని ప్రజలకు ఆయన కోరారు.

వాస్తవానికి నరేంద్ర మోడీని పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు అద్వానీ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, మోడీకి పెరుగుతున్న ఆదరణతో అద్వానీలో కూడా మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం మహారాష్ట్రలోని శెవగావ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అద్వానీ మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రస్తుతం దేశానికి కావల్సింది నినాదాల నాయకుడు కాదు.. దృఢమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేసే నాయకుడు. అందుకే మార్పు కోసం నరేంద్ర మోడీకి ఓటేయండి అని ప్రజలకు అద్వానీ పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu