Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరవింద్ కేజ్రీవాల్ పాకిస్థాన్ ఏజెంట్ : నరేంద్ర మోడీ

Advertiesment
నరేంద్ర మోడీ
, బుధవారం, 26 మార్చి 2014 (16:10 IST)
File
FILE
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పాకిస్థాన్ ఏజెంట్ అని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఆరోపించారు. అందువల్లే ఆప్ నేతలు జమ్మూకాశ్మీర్‌పై రెఫరెండం నిర్వహించాలని కోరుతున్నారన్నారు. ఆప్ పార్టీ వెబ్‌సైట్‌లో జమ్మూకాశ్మీర్‌ను పాకిస్థాన్‌లో చూపించడమే తాను చేసే ఆరోపణలకు నిదర్శనమన్నారు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని హీరా నగర్‌లో బుధవారం జరిగిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌పై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ఓ పాక్ ఏజెంట్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీ వెబ్ సైట్లో కాశ్మీర్‌ను పాకిస్థాన్ భూభాగంగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆమ్ ఆద్మీ నేతలు పాకిస్థాన్ తరపున మాట్లాడుతున్నట్టున్నారని ఆరోపించారు. పాకిస్థాన్ దగ్గర మూడు ఏకేలు ఉన్నాయని... వాటిలో మొదటిది ఏకే-47, రెండోది ఏకే ఆంటోనీ (భారత రక్షణ మంత్రి), మూడోది అరవింద్ కేజ్రీవాల్ (ఏకే) అంటూ నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు.

Share this Story:

Follow Webdunia telugu