Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజకీయాలకు నాగ్ మంచి ఫ్రెండ్... అందుకే బీజేపీ వైపు( మోడితో ఫోటోలు)

Advertiesment
నాగార్జున
, బుధవారం, 26 మార్చి 2014 (17:26 IST)
WD
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున బీజేపీ ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీని కలవడం ఇపుడు సంచలనంగా మారింది. నాగ్, మోడీని ఎందుకు కలిశారనే దానిపై సర్వత్రా ఆసక్తినెలకొంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో నాగ్ మోడీని కలిసినట్లు చెబుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్‌లో వున్న తమ ఆస్తులకు భవిష్యత్‌లో రక్షణ ఉంటుందనే ఉద్దేశంతోనే నాగార్జున మోడీని కలిశారని అంటున్నారు.
webdunia
WD



webdunia
WD

నాగార్జునకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని కాకపోతే ఆయన రాజకీయాలకు మంచి స్నేహితుడని కొందరు అంటున్నారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా పరోక్షంగా రాజకీయాల్లో వుండే వ్యక్తి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరిపోయే వ్యక్తి నాగార్జున అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి.
webdunia
WD



webdunia
WD
అక్కినేని నాగార్జున మోడికి వత్తాసు పలుకడంపై కాంగ్రెస్ నేతలు పొన్నం, రఘువీరా రెడ్డి వంటివారు మండిపడుతున్నారు. సినిమాలలో చూపించే ట్రిక్కులను తమపై చూపవద్దని వారు అంటున్నారు. దీనిపై పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గుజరాత్ పల్లెల గురించి చెప్పే నాగార్జున ఎపుడైనా బంజారాహిల్స్‌లోని ఫిల్మ్ నగర్ దాటి ఆంధ్రప్రదేశ్ పల్లెలు చూసేందుకు వచ్చారా అంటూ ప్రశ్నించారు.

అయినా ఓ సినీ ప్రముఖుడు తన అభిప్రాయం చెప్పడాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేరా...? నిన్న విహెచ్, ఇవాళ పొన్నం. వీరిద్దరూ నాగార్జున గుజరాత్ సందర్శించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడి బ్రహ్మాండమైన అభివృద్ధి చేశారని చెప్పడాన్ని తప్పుబట్టడమే కాదు... రచ్చరచ్చ చేస్తూ వ్యాఖ్యలు చేశారు.
webdunia
WD




webdunia
WD
పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... గుజరాత్ పల్లెల్ని కాదు... కరీంనగర్ పల్లెలికి రా బిడ్డా. నిన్ను సక్కంగా పలుకరిస్తాం. అంతేగాని గుజరాత్ పల్లెల్ని పొగడకు. రాజకీయాలు మాట్లాడకు. హైదరాబాదు ఫిలిమ్ నగర్ హద్దు దాటి బయటకు రావు, ఏసీ కారుల్లో చల్లటి గాలుల్లో తిరుగుతూ బయటి గాలిని కూడా పీల్చవు, నువ్వు రాజకీయాలు మాట్లాడితే ఊరుకోం.

నువ్వు హైదరాబాద్ లో స్టూడియోల కోసం తీసుకున్న భూములు సంగతి ఏంటో చూడు బిడ్డా. కాంగ్రెస్ మూడు రంగుల జెండా కప్పుతా... అంటూ నోటికి వచ్చినట్లు ఎడాపెడా మాట్లాడేశారు. అసలింతకీ నాగార్జున మోడీని కలిసిన తర్వాత తేడా ఏదయినా మాట్లాడారా.. అంటే అదీలేదు. ఆయన కేవలం మోడీ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడారు.
webdunia
WD



webdunia
WD
అదేవిధంగా మన రాష్ట్రంలోని ప్రాంతాలు కూడా అలా అభివృద్ధి అయితే బావుంటుంది అన్నారు...? ఇందులో ఏ రాజకీయ పార్టీని ఆయన విమర్శించినట్లు లేదు. కేవలం అలాంటి సౌకర్యాలను మన రాష్ట్రంలోని పల్లెలు కూడా పొందగలిగే రోజులు రావాలని ఆకాంక్షించారు.

నాగార్జునే కాదు... సుభిక్షంగా సంతోషంగా ఉన్న ప్రాంతాలను, మనుషులను చూస్తే ప్రతి ఒక్కరికి అలాగే అనిపిస్తుంది. మరి పొన్నంకు అలా అనిపించడంలేదా...? మన రాష్ట్ర ప్రజలు ఎలాంటి సౌకర్యాలు లేక విద్యుత్ కోతలు విధిస్తూ, నీళ్లు దొరక్క అల్లాడుతూ అలమటిస్తుంటే పొన్నంకు బావుంటుందా...? మన తెలుగు పల్లెలు బాగుపడకూడదా...?

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu