Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్నికలు 2014... రాష్ట్ర జనాభా 9 కోట్లు... పట్టుబడిన సొమ్ము రూ.131 కోట్లు

ఎన్నికలు 2014... రాష్ట్ర జనాభా 9 కోట్లు... పట్టుబడిన సొమ్ము రూ.131 కోట్లు
, మంగళవారం, 6 మే 2014 (13:31 IST)
FILE
ఎన్నికలు 2014లో తెలంగాణ, సీమాంధ్ర కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకులు తమ విశ్వరూపాన్ని చూపారా అని అనుకోవాల్సి వస్తోంది. దేశంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రూ. 283 కోట్ల రూపాయలు వర్షం కురిస్తే... అందులో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి రూ.131 కోట్లు. ఇదంతా అక్రమంగా ఎన్నికలు 2014లో తనిఖీల్లో పట్టుబడిన సొమ్ము.

ఇది చూస్తుంటే రాజకీయ నాయకులు అవినీతిపరులా? ప్రజలు అవినీతి పరులా? అనే చర్చకు దారితీస్తోంది. నగదుతోపాటు దేశవ్యాప్తంగా 2.13 కోట్ల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లో అది కోటి లీటర్లుగా ఉన్నట్లు తెలిపింది. అంటే నోటుకు ఓటు అనే ఫార్ములాను నాయకులంతా పాటించారా అనే సందేహం కలుగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu