ఇందిరా భవన్ కు వాస్తు దోషం... మెట్లను కూల్చేయిస్తున్న రఘువీరా
, గురువారం, 3 ఏప్రియల్ 2014 (12:23 IST)
2014
ఎన్నికల్లో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు సత్తా ఉన్న అభ్యర్థులు దొరక్క సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ సతమతమవుతున్న సంగతి తెలిసిందే. దీనికితోడు సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీకి హైదరాదులో కేటాయించిన ఇందిరా భవన్ లో వాస్తు దోషం ఉన్నట్లు తేలిందట. దీంతో సీమాంధ్ర పిసిసి చీఫ్ రఘువీరా రెడ్డి యుద్ధప్రాతిపదికన వాస్తును అనుసరించి ఇందిరా భవన్ కు మార్పులు చేయిస్తున్నారు.తమకు కేటాయించిన భవనానికి ఉండకూడని చోట మెట్లు ఉన్నాయని, వాటిని అలాగే ఉంచితే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలవుతుందనీ, పైకి రాకపోగా ఇంకా కిందికి పోతుందని వాస్తు నిపుణులు చెప్పారట. దాంతో ఆ మెట్లను కూల్చేసి వాస్తు ప్రకారం మరో దిక్కు నుంచి మెట్ల నిర్మాణం చేపట్టారు. ఈ మెట్లను పూర్తి చేసిన తర్వాత వాటిపై నుంచి అభ్యర్థులను నడిపించి టిక్కెట్లు కన్ఫర్మ్ చేయాలని రఘువీరా నిర్ణయించినట్లు చెపుతున్నారు.