Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్ జగన్ పార్టీ తరపున సమంత ప్రచారం.. ఫ్రెండ్ కోసం!

Advertiesment
సమంత
, శనివారం, 29 మార్చి 2014 (12:22 IST)
FILE
ప్రస్తుతం రాజకీయాల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్ నటీనటుల్లో కొందరు రాజకీయాల్లోకి అడుగుపెడుతుంటే మరికొందరు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా చెన్నై సుందరి సమంత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోందని వార్తలు వస్తున్నాయి.

సమంత వైఎస్ జగన్ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటుందని విశ్వసనీయ సమాచారం. అసలు ఆంధ్రా రాజకీయాల్లో సంబంధంలేని సమంత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీ తరపున ఎందుకు ప్రచారం చేస్తుందనే సందేహం రాక మానదు. అయితే అందుకు ఓ కారణం కూడా వుంది. సమంతకు కాస్ట్యూమ్ డీజైనర్ అయిన కోన నీరజ (కోన వెంకట్‌కి కజిన్) తండ్రి కోన రఘుపతి బాపట్ల నుంచి వైఎస్‌ఆర్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు.

అయితే ఆయన తరపున ప్రచారం చేయమని నీరజ కోరగా అందుకు సమంత ఒప్పుకున్నట్లు సమాచారం. అయినా ఇది ఊరికే కూడా కాదట, ఇందుకు గాను సమంతకు కోటి రూపాయలు సమర్పించుకుంటున్నారట. మరి, ఇందులో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu