Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోడికి నా సంపూర్ణ మద్దతు... తెలుగువారి బాధ చెప్పా... పవన్ కళ్యాణ్

Advertiesment
పవన్ కళ్యాణ్
, శుక్రవారం, 21 మార్చి 2014 (17:59 IST)
WD
భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుమారు 45 నిమిషాలపాటు పాటు జరిగింది. ఈ భేటీకి పవన్ కళ్యాణ్ అహ్మదాబాద్‌లో బీజేపీ నేత సోము వీర్రాజుతో కలసి మోడీతో సమావేశమయ్యారు. భేటీ ముగిశాక పవన్ కళ్యాణ్ ఓ విలేకరితో మాట్లాడారు.

తనకు పదవులపై వ్యామోహం లేదనీ, తెలుగు ప్రజలంతా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలన్న ఒకే ఒక్క ధ్యేయంతో మోడీని కలిసినట్లు చెప్పారు. తన సంపూర్ణ మద్దతు నరేంద్ర మోడికి ఉన్నదని వెల్లడించారు. ఏదో పదవుల కోసం తాను పార్టీ పెట్టలేదన్నారు. ప్రజల కోసమే జనసేన స్థాపించినట్లు తెలిపారు. నరేంద్ర మోడీ సైతం తెలుగు ప్రజల మధ్య ఎలాంటి ద్వేషపూరిత వాతావరణం లేకుండా చూడాల్సి ఉందని తనతో చెప్పినట్లు పవన్ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu