తెలంగాణాలో నోటిఫికేషన్ రిలీజ్ : టీడీపీ అభ్యర్థి నామినేషన్!
, బుధవారం, 2 ఏప్రియల్ 2014 (15:33 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. ఈ నోటిఫికేషనే విడుదలైన కొద్దిసేపటికే తెలుగుదేశం పార్టీకి చెందిన బాన్సువాడ అభ్యర్థి బాద్యానాయక్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నోటిఫికేషన్ జారీ ద్వారా తెలంగాణ ప్రాంతంలోని 17 లోక్సభ, 119 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 30వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నామినేషన్ల స్వీకరణ ఈ నెల 9వ తేదీ వరకు ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తెలంగాణలో ఏప్రిల్ 30న, సీమాంధ్రలో మే 7న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నోటిఫికేషన్ విడుదలైంది. 9 వరకు నామినేషన్ల స్వీకరణ, 10వ తేదీన స్క్రూటిని ఉంటుంది. 12వ తేదీ నామినేషన్ ఉపసంహరణకు తుది గడువు.